ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- May 04, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ప్రారంభమైంది. వసంత్ విహార్ లో నిర్మించిన ఈ కార్యాలయం (బీఆర్ఎస్ భవన్) ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయంను ప్రారంభించారు. అనంతరం లోపలికి అడుగు పెట్టారు. బీఆర్ఎస్ భవన్లో దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణంలో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. కార్యాలయంలో వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించారు. ఈ పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యాలయంకు ఎడమ వైపు సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం, కుడి వైపు జేడీయూ పార్టీ కార్యాలయం ఉంది.
బీఆర్ఎస్ భవనం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్కు వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భవనం నిర్మాణానికి సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్ 2న భూమిపూజ చేశారు. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, నాలుగు ప్రధాన కార్యదర్శుల చాంబర్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2, 3 అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, కేశవరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అయితే, ఈ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







