యూఏఈతో సహా 7 గమ్యస్థానాలకు 48 గంటల ఫ్లాష్ సేల్.. విమాన టిక్కెట్లపై 60% తగ్గింపు
- May 06, 2023
యూఏఈ: సౌదీయా ఎయిర్లైన్స్ నిర్దిష్ట గమ్యస్థానాలకు టిక్కెట్లపై ఫ్లాష్ సేల్ను ప్రకటించింది. ఇందులో భాగంగా విమాన టెక్కెట్లపై 60 శాతం వరకు తగ్గింపునిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌదీయా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. తగ్గింపు ధరలపై కొన్ని గమ్యస్థానాలకు టిక్కెట్లను విక్రయిస్తామని అందులో ఎయిర్లైన్ తెలిపింది. ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఎయిర్లైన్ అబుధాబి, కువైట్, దోహా, మస్కట్, మాడ్రిడ్, మారిషస్, గ్వాంగ్జౌ, మాల్దీవులకు టిక్కెట్లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. ఇది మే 10 నుండి జూన్ 15 వరకు ప్రయాణ కాలానికి ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఇటీవల యూఏఈ అతి తక్కువ-ధర విమానయాన సంస్థ విజ్ ఎయిర్ అబుధాబి భారతదేశానికి విమానాలను ప్రారంభించేందుకు నియంత్రణ విధానాలను అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!









