ఈ నెల 27న 'శకపురుషుని శతవసంతాలు' ఆన్లైన్ మీట్
- May 06, 2023
నార్వే: నందమూరి తారక రామా రావు శత జయంతిని పురస్కరించుకుని నార్వేకు చెందిన వీధి అరుగు సాహితీ సంస్థ ఆంధ్వర్యంలో "శకపురుషుని శతవసంతాలు" పేరుతో మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావును ఓ ప్రత్యేకమైన రీతిలో గుర్తు చేసుకునేందుకే ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తదితరుందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







