హమద్ ఎయిర్ పోర్ట్: ప్రయాణీకుల రద్దీలో 44.5% పెరుగుదల
- May 08, 2023
దోహా: హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2023 మొదటి త్రైమాసికంలో ప్రయాణీకుల రద్దీలో 44.5% పెరుగుదలను, విమానాల మూవ్ మెంట్స్ లో 18.65% పెరుగుదల నమోదు చేసింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 మొదటి త్రైమాసికంలో మొత్తం 10,315,695 మంది ప్రయాణికులు ప్రయాణించారు. జనవరిలో 3,558,918 మంది ప్రయాణికులు, ఫిబ్రవరిలో 3,240,114 మంది, మార్చిలో 3,516,663 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే కాలానికి సంబంధించి మొత్తం 56,417 ఎయిర్క్రాఫ్ట్ మూవ్ మెంట్స్ నమోదు కాగా.. ఇందులో జనవరిలో 19,377, ఫిబ్రవరిలో 17,479, మార్చిలో 19,561 ఎయిర్ క్రాఫ్ట్ లు వచ్చి వెళ్లాయి. అలాగే 2023 మొదటి త్రైమాసికంలో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 540,000 టన్నులకు పైగా కార్గోను సర్వీసులను నిర్వహించిందని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇంజినీర్ బదర్ మొహమ్మద్ అల్ మీర్ వెల్లడించారు. 2023 మొదటి త్రైమాసికంలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో లండన్, బ్యాంకాక్, ఢాకా, మనీలా మరియు జెడ్డా వంటి 40 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







