ఆన్లైన్లో ఇతరులను అవమానించడం చేస్తే..Dh500,000 వరకు జరిమానా
- May 14, 2023
యూఏఈ: సైబర్ ప్రపంచంలో కూడా UAE కఠినమైన చట్టాలను కలిగి ఉంది. ఆన్లైన్లో ఇతరులను అవమానించడం, తిట్టడం చేస్తే..Dh500,000 వరకు జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. తాజాగా జారీ చేసిన సలహాలో ఇతరులను అవమానించడం అనేది భారీ జరిమానాలతో శిక్షించదగిన తీవ్రమైన నేరమని నివాసితులను హెచ్చరించింది.
ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఇతరులను తిట్టడం, అవమానించడం లేదా ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడం వంటి నేరాలకు Dh250,000 నుండి Dh500,000 వరకు జరిమానా విధించవచ్చని అథారిటీ తెలిపింది.
బాధితుడు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగి లేదా పబ్లిక్ సర్వీస్లో ఉన్న ఎవరైనా అయితే, చట్టం ప్రకారం (ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 43) శిక్ష మరింత "ఎక్కువగా" ఉంటుంది. వాట్సాప్ సందేశంలో తన భార్యను "ఇడియట్" అని పిలిచినందుకు ఒక వ్యక్తి జైలు శిక్ష మరియు 20,000 దిర్హామ్లు జరిమానా విధించిన సందర్భాలు గతంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు