ఆన్లైన్లో ఇతరులను అవమానించడం చేస్తే..Dh500,000 వరకు జరిమానా
- May 14, 2023
యూఏఈ: సైబర్ ప్రపంచంలో కూడా UAE కఠినమైన చట్టాలను కలిగి ఉంది. ఆన్లైన్లో ఇతరులను అవమానించడం, తిట్టడం చేస్తే..Dh500,000 వరకు జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. తాజాగా జారీ చేసిన సలహాలో ఇతరులను అవమానించడం అనేది భారీ జరిమానాలతో శిక్షించదగిన తీవ్రమైన నేరమని నివాసితులను హెచ్చరించింది.
ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఇతరులను తిట్టడం, అవమానించడం లేదా ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడం వంటి నేరాలకు Dh250,000 నుండి Dh500,000 వరకు జరిమానా విధించవచ్చని అథారిటీ తెలిపింది.
బాధితుడు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగి లేదా పబ్లిక్ సర్వీస్లో ఉన్న ఎవరైనా అయితే, చట్టం ప్రకారం (ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 43) శిక్ష మరింత "ఎక్కువగా" ఉంటుంది. వాట్సాప్ సందేశంలో తన భార్యను "ఇడియట్" అని పిలిచినందుకు ఒక వ్యక్తి జైలు శిక్ష మరియు 20,000 దిర్హామ్లు జరిమానా విధించిన సందర్భాలు గతంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









