సౌదీ ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో 'ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు'
- May 14, 2023
సౌదీ అరేబియా: ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం సౌదీ అరేబియా ఆధ్వర్యంలో మే 12న డమ్మామ్ నందు అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా ఆధ్వర్యములో యుగపురుషుడు "ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు", మినీ మహానాడు కార్యక్రమము ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏ .పి .ఎన్.ఆర్. టి చైర్మన్ డాక్టరు రవి కుమార్ వేమూరు, ఎన్.ఆర్.ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాథకృష్ణ దృశ్య మాధ్యము ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డమ్మామ్ ఖోబర్ హస నగరముల నుండి ఎన్టీఆర్, తెలుగు దేశము అభిమానులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా చేసిన సంస్కరణలు గురించి, పటేల్, పట్వారి వ్యవస్థల రద్దు గురుంచి..ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు గురుంచి అందరూ గుర్తుచేసుకున్నారు.అలాగే నేటి ప్రభుత్వము చేస్తున్న విధ్వంసకర పరిపాలన గురించి, మరల చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాల్సిన ఆవశ్యకత గురించి తద్వారా మరల ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధిలో తీసుకు రావాలి అని రాధా కృష్ణ అందరిని కోరారు. కుల,మతాలకు అతీతము గా ఎన్టీఆర్ అభిమానులు ముఖ్యముగా తెలుగుదేశం కుటుంబసభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతము చేసారని ఖాలిద్ సైఫుల్లా తెలిపారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా కార్యదర్శి భాస్కర్, డమ్మామ్ కోఆర్డినేటర్ జాకిర్ హుస్సేన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నరసింహ, రమణ, సత్య, నరేష్, రావు, ప్రసాద్, జాన్సన్, విక్టర్, సత్యనారాయణ షైక్ అహ్మద్, మిహమెద్ మాలిక్, చాన్ బాషా,అబ్దుల్, మజ్రుల్, మొహమ్మద్ అజాం, సుబ్రహ్మణ్యం, రాజా ఆగ, సిద్ధిక్, హనుమంత రావు, అబ్దుల్, ఇక్బాల్, హనుమంత, అబ్దుల జమీల్, సాహిక్ అదిల్, ముజమీల్, కొసరు అలీ, షఫీక్ పాల్గొన్నారు.


తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









