జీబ్రా క్రాసింగ్‌ల వద్ద వాహనాలు ఆపని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా

- May 15, 2023 , by Maagulf
జీబ్రా క్రాసింగ్‌ల వద్ద వాహనాలు ఆపని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా

యూఏఈ: కొంతమంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తారు. పాదచారుల క్రాసింగ్‌ల వద్ద వాహనాలు ఆపని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా విధించనున్నారు. ఉమ్ అల్ క్వైన్ పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ అవేర్‌నెస్ ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. రహదారి వినియోగదారులందరిలో ట్రాఫిక్ అవగాహనను పెంపొందించడం, ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండటం ప్రాముఖ్యతను స్థాపించడం, రోడ్డును సురక్షితంగా దాటడానికి పాదచారుల హక్కులను చెప్పడం ఈ ప్రచారం లక్ష్యం.

ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్, పెట్రోల్స్ డైరెక్టర్ కల్నల్ ఖలీద్ అలీ ముహమ్మద్ బౌసీబా.. ఈ ప్రచారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యూహంతో వివిధ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాదచారులను వారి భద్రత కోసం నియమించబడిన ప్రాంతాలను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. 

ట్రాఫిక్ చట్టాల ఆర్టికల్ 69 ప్రకారం.. క్రాసింగ్ కోసం నిర్దేశించిన ప్రదేశాలలో పాదచారులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh500 జరిమానా విధించబడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆరు బ్లాక్ పాయింట్లు జోడించబడతాయి.

డ్రైవర్లు, పాదచారులందరూ పోలీసులతో సహకరించాలని.. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి వారి భద్రత, వారి చుట్టూ ఉన్న వారి భద్రతను నిర్ధారించాలని కల్నల్ బౌసెయిబా కోరారు. ట్రాఫిక్ సేఫ్టీ కాన్సెప్ట్‌ను అమలు చేయడంలో ట్రాఫిక్ సేఫ్టీ అధికారులు, మొత్తం సమాజం సహకారాన్ని ఆయన అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com