ఎఎమ్‌ఎఫ్‌ని ప్రారంభించిన మొహమ్మద్‌

- May 10, 2016 , by Maagulf
ఎఎమ్‌ఎఫ్‌ని ప్రారంభించిన మొహమ్మద్‌

అరబ్‌ మీడియా ఫోరమ్‌ 15వ ఎడిషన్‌ని వైస్‌ ప్రిసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ది యూఏఈ మరియు దుబాయ్‌ రూలర్‌, దుబాయ్‌లో ప్రారంభించారు. ప్రెస్‌ క్లబ్‌ దుబాయ్‌ ఛైర్మన్‌, మీడియా ఆఫీస్‌ ఆఫ్‌ ది గవర్నమెంట్‌ ఆఫ్‌ దుబాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ మోనా ఘానెమ్‌ అల్‌ మర్రి, స్వాగత ప్రసంగం చేశారు. మీడియా రంగంలో గడచిన 15 ఏళ్ళలో ఎన్నో మార్పులు సంభవించాయని ఆయన చెప్పారు. అరబ్‌ ప్రపంచ అభివృద్ధిలో మీడియా పాత్రను పలువురు ప్రముఖులు కొనియాడారు. మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. అభివృద్ధితోపాటు ప్రజల సమస్యలపై మీడియా దృష్టిపెట్టవలసి ఉందని వారు అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా ద్వారా సామాన్యులు కూడా తమ చుట్టు పక్కల జరుగుతున్న విషయాల్ని ప్రపంచం దృష్టికి తీసుకువస్తున్నారనీ, ఇది మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమని మీడియా రంగ ప్రముఖులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com