సైబర్ థ్రెట్స్ నుండి పిల్లలను రక్షించాలి.. పేరెంట్స్ కు అలెర్ట్
- May 18, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోని తల్లిదండ్రులు తమ పిల్లలకు సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్లు, అన్ని రకాల ఎలక్ట్రానిక్ గేమ్ యాప్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్లోని చైల్డ్ సైబర్ ప్రొటెక్షన్ యూనిట్ సూచించింది. ఏదైనా ముప్పు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలను వారికి అవగాహన కల్పించడంతో పాటు, పిల్లలను నిరంతరం గమనించాలని, పిల్లలు ఉపయోగించే అప్లికేషన్లను తరచూ చెక్ చేయాలని సలహా ఇచ్చింది.
బహ్రెయిన్ బయటి నుండి గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు కొన్ని అప్లికేషన్లలో నకిలీ పేర్లు, ఖాతాలను ఉపయోగించి పిల్లలను చీట్ చేస్తున్నారని నివేదికలు అందాయని పేర్కొంది. యూనిట్కు వ్యక్తిగతంగా నివేదించడం, హాట్లైన్ (992)కి కాల్ చేయడం లేదా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యూనిట్కి ([email protected]) ఇమెయిల్ పంపడం ద్వారా ఇటువంటి ఉల్లంఘనలు లేదా బెదిరింపుల గురించి అధికారిక నివేదికను సమర్పించాలని తల్లిదండ్రులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!