ఒమన్ లో 925 మంది ఖైదీలు విడుదల
- May 23, 2023
మస్కట్: "ఫక్ కుర్బా" ఇనిషియేటివ్ 10వ ఎడిషన్లో భాగంగా ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్ల నుండి 925 మంది ఖైదీలు విడుదలైనట్లు ఒమానీ లాయర్స్ అసోసియేషన్ (OLA) వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ నుంచి 194, ఉత్తర అల్ బతినా- 191, దక్షిణ అల్ బతినా- 122, అల్ దహిరా- 97, అల్ బురైమి- 87, అల్ దఖిలియా- 79, ఉత్తర అషర్కీయా- 59, అషర్కీయా- 40, ధోఫర్- 33, అల్ వుస్తా- 20, ముసందం- 3 కేసులు ఉన్నాయని OLA ఛైర్మన్ డా. మహమ్మద్ బిన్ ఇబ్రహీం అల్-జడ్జాలీ తెలిపారు. తాము ఆర్థిక క్లెయిమ్ల కోసం ఖైదు చేయబడిన లేదా జైలులో ఉన్న 5,894 మంది ఖైదీలను సమిష్టిగా విడుదల చేసామన్నారు. దీనిని విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









