చంద్రునిపై అడుగుపెట్టే మొదటి మహిళ బహ్రెయిన్ కావచ్చు..!

- May 31, 2023 , by Maagulf
చంద్రునిపై అడుగుపెట్టే మొదటి మహిళ బహ్రెయిన్ కావచ్చు..!

బహ్రెయిన్: చంద్రునిపై అడుగుపెట్టే మొదటి మహిళగా చరిత్ర సృష్టించడానికి బహ్రెయిన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024 నాటికి చంద్రునిపై మహిళను పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టెమిస్ ఒప్పందాలను షురా కౌన్సిల్ తాజాగా  ఆమోదించింది. ఆర్టెమిస్ ఒప్పందాలు అనేది.. అమెరికా, ఇతర దేశాలు సంతకం చేసిన నాన్-బైండింగ్ బహుపాక్షిక ఒప్పందం. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ద్వారా 2020లో ప్రవేశపెట్టబడ్డాయి. 2025 నాటికి చంద్రునిపైకి ప్రజలను పంపడం, అంతరిక్ష పరిశోధన కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం వీటి లక్ష్యాలు. బహ్రెయిన్ అంతరిక్ష పరిశోధన పురోగతికి దోహదపడటానికి ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేస్తుందని కౌన్సిల్ పేర్కొంది. బహ్రెయిన్ కూడా ప్రధాన అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, చంద్రునిపై నడిచిన మొదటి మహిళ బహ్రెయిన్‌గా ఉండటానికి మార్గం వేయడం ద్వారా దేశం చరిత్ర సృష్టిస్తుందని కౌన్సిల్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com