రియాద్లో సింహాన్ని బంధించిన ప్రత్యేక దళాలు
- June 01, 2023
రియాద్: పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు రియాద్ నగర పరిసరాల్లో తిరుగుతున్న సింహాన్ని బంధించాయి. సింహాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అధికారిక నివేదికల ప్రకారం.. ప్రత్యేక దళాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. సింహాన్ని బంధించి వన్యప్రాణి అథారిటీకి అప్పగించారు.
పర్యావరణ చట్టంలోని నిబంధనల ప్రకారం.. అంతరించిపోతున్న వన్యప్రాణులతో వ్యాపారం చేయడంతో పాటు వాటిని స్వాధీనంలో పెట్టుకోవడం నిషేధించబడిందని ప్రత్యేక దళాలు పేర్కొన్నాయి. ఇందులు పాల్పడిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా గరిష్టంగా SR30 మిలియన్ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 నంబర్కు.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా పర్యావరణం లేదా వన్యప్రాణులపై ఏవైనా దాడులు జరిగినప్పుడు రిపోర్ట్ చేయాలని స్పెషల్ ఫోర్సెస్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







