ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్’ క్యాంపెయిన్
- June 05, 2023
రియాద్: సౌదీ బ్యాంక్స్ మీడియా అండ్ అవేర్నెస్ కమిటీ ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్’ పేరుతో కొత్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వినూత్న మోసపూరిత పద్ధతుల గురించి అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా ఫేక్ బ్యాంక్ కాల్స్, అనామక కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, నకిలీ ఆన్లైన్ స్టోర్ల ద్వారా మరియు ఫిషింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడతారని వివరిస్తుంది. సోషల్ మీడియా సైట్ల ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దన్నారు. అజ్ఞాత వ్యక్తులు తమ బ్యాంక్ వివరాలను అడిగే అనామక కాల్లకు సమాధానం ఇవ్వవద్దని, జాగ్రత్తగా ఉండాలని కమిటీ ప్రజలను హెచ్చరించింది. నకిలీ ప్రకటనలు, అనుమానాస్పద సందేశాలు, అతిశయోక్తి ఆఫర్ల వంటి మోసపూరిత మూలాధారాలకు కూడా ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా తమ బ్యాంక్ కార్డుల పాస్వర్డ్లను ఇతరులకు చెప్పవద్దని కమిటీ పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ సైట్ల విశ్వసనీయతను పరిశీలించాలని, సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని కమిటీ పేర్కొంది. తమ బ్యాంకు కార్డుల పాస్వర్డ్ను కాలానుగుణంగా మార్చుకోవాలని పౌరులను కమిటీ కోరింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







