ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్’ క్యాంపెయిన్
- June 05, 2023
రియాద్: సౌదీ బ్యాంక్స్ మీడియా అండ్ అవేర్నెస్ కమిటీ ఆర్థిక మోసాలపై ‘నాట్ నార్మల్’ పేరుతో కొత్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వినూత్న మోసపూరిత పద్ధతుల గురించి అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా ఫేక్ బ్యాంక్ కాల్స్, అనామక కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, నకిలీ ఆన్లైన్ స్టోర్ల ద్వారా మరియు ఫిషింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడతారని వివరిస్తుంది. సోషల్ మీడియా సైట్ల ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దన్నారు. అజ్ఞాత వ్యక్తులు తమ బ్యాంక్ వివరాలను అడిగే అనామక కాల్లకు సమాధానం ఇవ్వవద్దని, జాగ్రత్తగా ఉండాలని కమిటీ ప్రజలను హెచ్చరించింది. నకిలీ ప్రకటనలు, అనుమానాస్పద సందేశాలు, అతిశయోక్తి ఆఫర్ల వంటి మోసపూరిత మూలాధారాలకు కూడా ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా తమ బ్యాంక్ కార్డుల పాస్వర్డ్లను ఇతరులకు చెప్పవద్దని కమిటీ పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ సైట్ల విశ్వసనీయతను పరిశీలించాలని, సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా అవసరం అని కమిటీ పేర్కొంది. తమ బ్యాంకు కార్డుల పాస్వర్డ్ను కాలానుగుణంగా మార్చుకోవాలని పౌరులను కమిటీ కోరింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







