RP పట్నాయక్ మెలోడీలతో మరో ఈవెంట్ అందించిన ఆంధ్ర కళా వేదిక
- June 13, 2023
దోహా: దోహా, ఖతార్ లోని అద్భుతమైన ప్రాంగణం "లా సిగాలే" హోటల్ లోని అల్ వాజ్బా బాల్ రూమ్ లో వేసవి తాపాన్ని తీర్చే కార్యక్రమం "సమ్మర్ ఫీస్ట్" ను "రవి మెలోడీస్" ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ఆద్యంతమూ ఆర్పీ పట్నాయక్ గళం, అయన పంచుకున్న అనుభవాలు, ఓపికతో ఇచ్చిన ఫొటోల అనుమతి అందరిని మంత్ర ముగ్ధులను చేసాయి. "మనసంతా నువ్వే" అంటూ మదిలోని మధుర స్మృతులను కళ్ళముందుకి తెచ్చాయి. ఆర్పీ తో పాటుగా సత్య యామిని, GV భాస్కర్ మరియు రవి పాటలు ప్రేక్షకులను సీట్లకు కట్టి పడేస్తే, తెలంగాణ సింగర్ లక్ష్మి పాటలతో హాలంతా కేరింతలు, ఈలలు డాన్సులతో దద్దరిల్లింది. ఆద్యంతమూ హుషారుగా సాగిన రమణీయమైన, మధురమైన పాటల పరంపర ఖతార్ తెలుగువారందరిని ఉర్రూతలూగించటమే కాక వారికి మరవలేని అనుభూతిని మిగిలింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని వేయి నోళ్ల పొగిడారు. ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఉండాలని అభినందించారు.
ఈ కార్యక్రమానికి ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థల (ICC, ISC, ICBF) వారి ప్రతినిధులందరూ హాజరయినారు. అలాగే తెలుగు ప్రముఖులు KS ప్రసాద్ మరియు తెలుగు సంస్థల (TGS, TJQ, TPS, TKS, TBA) అధ్యక్షులు, వారి ప్రతినిధులందరూ కూడా హాజరయినారు. కార్యక్రమ నిర్వహణ విధానం, హాజరైన వారి స్పందన, నినాదాలు వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. ఆంధ్ర కళా వేదిక కార్యవర్గం వారందరినీ పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించడం జరిగింది.
ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని నలుమూలల నుండి విశేషంగా సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, ఈ కార్యక్రమం 2023 సంవత్సరంలో వరుసగా 4వ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని, ఆదరించి విజయవంతం చేసిన అందరికి శత సహస్ర వందనములు తెలియజేసారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి అవకాశం కల్పించి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ముఖ్యంగా IGPL అధినేత శ్యాంబాబు గంధం, రవి మెలోడీస్ అధినేత రవి కుమార్ మంద కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్) గా సహకరించిన వారికి, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన మీడియా సహకారాన్ని అందిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అదే వేదికపై నట సింహం నందమూరి బాలకృష్ణ 63వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్పీ పట్నాయక్ గారి సమక్షంలో అభిమానుల చేతుల మీదుగా కేక్ కటింగ్ కూడా జరిగింది. హాజరైనవారందరికి షడ్రసోపేతమైన రుచికరమైన భోజనం అందించారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, శ్రీ సుధ, శిరీష రామ్, శేఖరం రావు, సాయి రమేష్, సోమరాజు, రవీంద్ర, వీబీకే మూర్తి బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు మరియు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







