సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి..

- May 13, 2016 , by Maagulf
సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి..

సౌరశక్తితో రైలును నడిపించాలని భారత రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు భారత్‌లోని తొలి సోలార్‌ రైలు నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే సోలార్‌ రైలును ట్రయల్‌ రన్‌ చేస్తామని నార్త్‌వెస్ట్రన్‌ రైల్వే పీఆర్వో గోపాల్‌ శర్మ వెల్లడించారు. ఈ నెలాఖరులో ట్రయల్‌ రన్‌ ఉండొచ్చని చెప్పారు.పై కప్పు మీద సోలార్‌ ప్యానల్స్‌తో ప్రత్యేకంగా కోచ్‌లను నిర్మిస్తున్నారు. రైలు లోపల లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు సోలార్‌ ప్యానల్స్‌ ద్వారా విద్యుత్‌ అందుతుంది. రైలు మాత్రం డీజిల్‌ ఇంజన్లతో నడుస్తుంది. రైళ్లలో ఇంధన ఉపయోగాన్ని తగ్గించడానికి రైల్వే ఇప్పటికే సీఎన్‌జీ, బయోడీజిల్‌, సహజవాయువు తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com