కియారా అద్వానీకి తొమ్మిదేళ్లు.!
- June 15, 2023
అవునండీ మీరు విన్నది నిజమే. హీరోయిన్గా కియారా అద్వానీ కెరీర్ స్టార్ట్ అయ్యి తొమ్మిదేళ్లు గడిచింది. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన కియారా తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమా సూపర్ హిట్. రెండో సినిమాకి రామ్ చరణ్తో జత కట్టింది కానీ, ఫెయిలైంది. ఇక్కడ ఫెయిలైనా, బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ కలిసొచ్చింది కియారాకి.
ప్రస్తుతం కియారా ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రంలో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడే తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. అప్పుడే తొమ్మిదేళ్లు గడిచిపోయాయా.? అంటూ సోషల్ మీడియా వేదికగా కియారా ఓ పోస్ట్ పెట్టింది.
ఇన్నేళ్లు తనను అభిమానించిన అభిమానులందరికీ, సపోర్ట్ చేసిన శ్రేయోభిలాషులకీ కియారా ఈ సందర్భంగా థాంక్స్ చెప్పింది.
తొమ్మిదేళ్లు గడిచినా నటనలో ఇంకా కొత్తగానే వుందని తెలిపింది. నటనలో మరింత పరిణీతి చెంది, మరింతగా మీ ఆదరాభిమానాలను అందుకుంటానని తెలిపింది. కియారా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..
- యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- దేశంలో ఎడ్యు కేషన్ సిస్టమ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- ఈద్ అల్ అధా తేదీలు ప్రకటింపు
- ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!









