నాగ్పూర్లో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్
- June 15, 2023
ముంబయి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాలయంలో లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ను వేద పండితులు ఆశీర్వదించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నాగ్పూర్ పట్టణమంతా బిఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సీఎం కెసిఆర్ ముఖచిత్రంతో కూడిన ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి