కచ్చా మ్యాంగో బిర్యానీ
- June 22, 2015
కావల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
పచ్చి మామిడి కాయ - ఒకటి
యాలకులు - 4
లవంగాలు - 4
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి - రెండు
మిరియాలు - 6
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - అరటీ స్పూను
అల్లం తురుము - టీ స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా
తయారు చేసే విధానం
బాస్మతి బియ్యం కడిగి పావుగంట సేపు నాననివ్వాలి. తరువాత ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వేయించి తరువాత అల్లం తురుము, పచ్చి మామిడికాయ తురుము కూడా వేసి వేయించి సిమ్లో ఒక ఐదు నిముషాలు ఉంచి, పసుపు, జీలకర్ర పొడి, చల్లి మరో రెండు నిముషాలు వేయించి, కడిగి నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసి, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లోనే రెండు విజిల్ రానివ్వాలి. చల్లారాక మూత తీసి గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు వేసి వేడివేడిగా చికెన్ లేదా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే మామిడి కాయ్ బిర్యానీ రెడీ.
తాజా వార్తలు
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!









