కచ్చా మ్యాంగో బిర్యానీ
- June 22, 2015
కావల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
పచ్చి మామిడి కాయ - ఒకటి
యాలకులు - 4
లవంగాలు - 4
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి - రెండు
మిరియాలు - 6
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - అరటీ స్పూను
అల్లం తురుము - టీ స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా
తయారు చేసే విధానం
బాస్మతి బియ్యం కడిగి పావుగంట సేపు నాననివ్వాలి. తరువాత ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వేయించి తరువాత అల్లం తురుము, పచ్చి మామిడికాయ తురుము కూడా వేసి వేయించి సిమ్లో ఒక ఐదు నిముషాలు ఉంచి, పసుపు, జీలకర్ర పొడి, చల్లి మరో రెండు నిముషాలు వేయించి, కడిగి నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసి, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లోనే రెండు విజిల్ రానివ్వాలి. చల్లారాక మూత తీసి గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు వేసి వేడివేడిగా చికెన్ లేదా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే మామిడి కాయ్ బిర్యానీ రెడీ.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







