కచ్చా మ్యాంగో బిర్యానీ
- June 22, 2015
కావల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
పచ్చి మామిడి కాయ - ఒకటి
యాలకులు - 4
లవంగాలు - 4
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి - రెండు
మిరియాలు - 6
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - అరటీ స్పూను
అల్లం తురుము - టీ స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా
తయారు చేసే విధానం
బాస్మతి బియ్యం కడిగి పావుగంట సేపు నాననివ్వాలి. తరువాత ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వేయించి తరువాత అల్లం తురుము, పచ్చి మామిడికాయ తురుము కూడా వేసి వేయించి సిమ్లో ఒక ఐదు నిముషాలు ఉంచి, పసుపు, జీలకర్ర పొడి, చల్లి మరో రెండు నిముషాలు వేయించి, కడిగి నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసి, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లోనే రెండు విజిల్ రానివ్వాలి. చల్లారాక మూత తీసి గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు వేసి వేడివేడిగా చికెన్ లేదా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే మామిడి కాయ్ బిర్యానీ రెడీ.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







