సిటీ సెంటర్లో ఆకట్టుకున్న మిల్లెట్ ఫెస్టివల్
- June 18, 2023
కువైట్: కువైట్లోని ప్రముఖ హైపర్మార్కెట్ చైన్ సిటీ సెంటర్ వారి సాల్మియా షోరూమ్లో మిల్లెట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. మిల్లెట్ ఫెస్టివల్ను కువైట్లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంటర్ సీఓఓ శ్రీ అజయ్ గోయెల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మిల్లెట్ ఫెస్టివల్ నెలరోజుల ప్రచారంలో భాగంగా మిల్లెట్ యొక్క పోషక, ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతోపాటు, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దేశంలోని పలు సిటీ సెంటర్ స్టోర్లలో భారతదేశంలోని వివిధ రకాల మిల్లెట్లు అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్ ఫెస్ట్లో భాగంగా వివిధ రకాల రుచికరమైన మిల్లెట్ వంటకాలను చెఫ్ ఛాయా ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, మార్చి 2021లో దాని 75వ సెషన్లో 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (IYM2023)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!







