సిటీ సెంటర్లో ఆకట్టుకున్న మిల్లెట్ ఫెస్టివల్
- June 18, 2023
కువైట్: కువైట్లోని ప్రముఖ హైపర్మార్కెట్ చైన్ సిటీ సెంటర్ వారి సాల్మియా షోరూమ్లో మిల్లెట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. మిల్లెట్ ఫెస్టివల్ను కువైట్లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంటర్ సీఓఓ శ్రీ అజయ్ గోయెల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మిల్లెట్ ఫెస్టివల్ నెలరోజుల ప్రచారంలో భాగంగా మిల్లెట్ యొక్క పోషక, ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతోపాటు, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దేశంలోని పలు సిటీ సెంటర్ స్టోర్లలో భారతదేశంలోని వివిధ రకాల మిల్లెట్లు అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్ ఫెస్ట్లో భాగంగా వివిధ రకాల రుచికరమైన మిల్లెట్ వంటకాలను చెఫ్ ఛాయా ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, మార్చి 2021లో దాని 75వ సెషన్లో 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (IYM2023)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







