రియాల్టీ కాంట్రాక్ట్ వివాదం.. కస్టమర్కు BD5000 రీఫండ్
- June 18, 2023
బహ్రెయిన్: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లోయర్ సివిల్ కోర్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మొట్టికాయలు వేసింది. కస్టమర్ కు BD5,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, కస్టమర్ కొనుగోలు ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయడంలో విఫలమైతే వాపసు పొందేందుకు అర్హత ఉండదు. అయితే, ఫిర్యాది ఒకే చెక్కులో పూర్తి చెల్లింపు చేసినందున, వారు రిఫండ్ పొందేందుకు అర్హులని కోర్టు నిర్ధారించింది. ఫిర్యాదుదారు రెండు నెలల వ్యవధిలో విల్లాను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కేసు దాఖలైంది. వ్యక్తి మజాయా ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే చెక్కు ద్వారా సింగిల్ పేమెంట్ చేసినా రిఫండ్ కోసం అభ్యర్థించినప్పుడు, కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, చెల్లింపు ఆలస్యం అయిందని పేర్కొంటూ నిరాకరించింది.దీంతో కస్టమర్ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..







