రియాల్టీ కాంట్రాక్ట్ వివాదం.. కస్టమర్కు BD5000 రీఫండ్
- June 18, 2023
బహ్రెయిన్: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లోయర్ సివిల్ కోర్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మొట్టికాయలు వేసింది. కస్టమర్ కు BD5,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, కస్టమర్ కొనుగోలు ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయడంలో విఫలమైతే వాపసు పొందేందుకు అర్హత ఉండదు. అయితే, ఫిర్యాది ఒకే చెక్కులో పూర్తి చెల్లింపు చేసినందున, వారు రిఫండ్ పొందేందుకు అర్హులని కోర్టు నిర్ధారించింది. ఫిర్యాదుదారు రెండు నెలల వ్యవధిలో విల్లాను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కేసు దాఖలైంది. వ్యక్తి మజాయా ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే చెక్కు ద్వారా సింగిల్ పేమెంట్ చేసినా రిఫండ్ కోసం అభ్యర్థించినప్పుడు, కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, చెల్లింపు ఆలస్యం అయిందని పేర్కొంటూ నిరాకరించింది.దీంతో కస్టమర్ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









