రియాల్టీ కాంట్రాక్ట్ వివాదం.. కస్టమర్కు BD5000 రీఫండ్
- June 18, 2023
బహ్రెయిన్: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లోయర్ సివిల్ కోర్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మొట్టికాయలు వేసింది. కస్టమర్ కు BD5,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, కస్టమర్ కొనుగోలు ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయడంలో విఫలమైతే వాపసు పొందేందుకు అర్హత ఉండదు. అయితే, ఫిర్యాది ఒకే చెక్కులో పూర్తి చెల్లింపు చేసినందున, వారు రిఫండ్ పొందేందుకు అర్హులని కోర్టు నిర్ధారించింది. ఫిర్యాదుదారు రెండు నెలల వ్యవధిలో విల్లాను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కేసు దాఖలైంది. వ్యక్తి మజాయా ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే చెక్కు ద్వారా సింగిల్ పేమెంట్ చేసినా రిఫండ్ కోసం అభ్యర్థించినప్పుడు, కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, చెల్లింపు ఆలస్యం అయిందని పేర్కొంటూ నిరాకరించింది.దీంతో కస్టమర్ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







