బహ్రెయిన్లకు నాణ్యమైన విద్య కోసం కృషి
- June 20, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లకు నాణ్యమైన విద్య అందించడమే తమకు అత్యంత ప్రాధాన్యత అంశం అని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలకు హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిబద్ధత రాజ్యమంతటా విస్తరిస్తామని, విద్యా నైపుణ్యం కోసం కృషి చేసే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు HRH ప్రిన్స్ సల్మాన్ తెలిపారు. విద్యా లక్ష్యాలను సాధించడానికి పౌరులందరికీ నాణ్యమైన విద్యను అందించే ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ లేబర్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన నిపుణులను నిర్మించడంలో విద్య సాయపడుతుందని, రాజ్య అభివృద్ధికి ఇది ఒక ప్రధాన స్తంభం అని అతని రాయల్ హైనెస్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థులు రాజ్యంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలను అందుకోవడంలో సహకరించిన ప్రతిఒక్కరిని అభినందించారు. ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా విద్యా సృజనాత్మకతను పెంపొందించడానికి ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, వినూత్న పరిష్కారాలను అన్వేషించాలని సూచించారు. ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రి HE షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, కేబినెట్ వ్యవహారాల మంత్రి HE హమద్ బిన్ ఫైసల్ అల్ మల్కీ, విద్యా మంత్రి HE డాక్టర్ మహ్మద్ బిన్ ముబారక్ జుమా ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం









