విజయవాడ–చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్
- July 03, 2023
అమరావతి: ఏపి రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ- చెన్నై మధ్య నడిచే రైలు ఒకటి. ఈ నెల 8 నుంచి రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, రాకపోకల షెడ్యూల్, టికెట్ ధరలు తదితర వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట మీదుగా రైలును నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్