విజయవాడ–చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్
- July 03, 2023
అమరావతి: ఏపి రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ- చెన్నై మధ్య నడిచే రైలు ఒకటి. ఈ నెల 8 నుంచి రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, రాకపోకల షెడ్యూల్, టికెట్ ధరలు తదితర వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట మీదుగా రైలును నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









