BAPS బృందంతో షేక్ నహ్యాన్ సమావేశం
- July 10, 2023
అబుధాబి: BAPS స్వామీజీలు, వాలంటీర్లతో కూడిన బ్రహ్మవిహారిదాస్ స్వామి బృందానికి అబుధాబిలోని తన ప్రైవేట్ రాయల్ మజ్లిస్లో మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు. అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. మందిర్ నిర్మాణం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా షేక్ నహ్యాన్ చరిత్రను రూపొందించడంలో స్వామీజీలు, వాలంటీర్ల గణనీయమైన సహకారాన్ని ప్రశంసించారు. అబుధాబిలోని BAPS హిందూ మందిర్ శాశ్వతమైన విలువలు, అది ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక వారసత్వం స్వరూపంగా నిలుస్తుందన్నారు. మందిర నిర్మాణం భారతదేశం, యూఏఈ మధ్య లోతైన స్నేహానికి నిదర్శనంగా పనిచేస్తుందని, అదే సమయంలో అంతర్జాతీయ సామరస్యాన్ని కూడా పెంపొందిస్తుందని కొనియాడారు. చారిత్రాత్మకమైన మందిర నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించినందుకు బ్రహ్మవిహారిదాస్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు పూజ్య మహంత్ స్వామి మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. మందిరాన్ని ఫిబ్రవరి 2024లో ప్రారంభించనున్నట్టు బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ తెలియజేశారు.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







