BAPS బృందంతో షేక్ నహ్యాన్ సమావేశం
- July 10, 2023
అబుధాబి: BAPS స్వామీజీలు, వాలంటీర్లతో కూడిన బ్రహ్మవిహారిదాస్ స్వామి బృందానికి అబుధాబిలోని తన ప్రైవేట్ రాయల్ మజ్లిస్లో మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు. అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. మందిర్ నిర్మాణం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా షేక్ నహ్యాన్ చరిత్రను రూపొందించడంలో స్వామీజీలు, వాలంటీర్ల గణనీయమైన సహకారాన్ని ప్రశంసించారు. అబుధాబిలోని BAPS హిందూ మందిర్ శాశ్వతమైన విలువలు, అది ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక వారసత్వం స్వరూపంగా నిలుస్తుందన్నారు. మందిర నిర్మాణం భారతదేశం, యూఏఈ మధ్య లోతైన స్నేహానికి నిదర్శనంగా పనిచేస్తుందని, అదే సమయంలో అంతర్జాతీయ సామరస్యాన్ని కూడా పెంపొందిస్తుందని కొనియాడారు. చారిత్రాత్మకమైన మందిర నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించినందుకు బ్రహ్మవిహారిదాస్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు పూజ్య మహంత్ స్వామి మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. మందిరాన్ని ఫిబ్రవరి 2024లో ప్రారంభించనున్నట్టు బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ తెలియజేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







