BAPS బృందంతో షేక్ నహ్యాన్ సమావేశం
- July 10, 2023
అబుధాబి: BAPS స్వామీజీలు, వాలంటీర్లతో కూడిన బ్రహ్మవిహారిదాస్ స్వామి బృందానికి అబుధాబిలోని తన ప్రైవేట్ రాయల్ మజ్లిస్లో మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు. అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. మందిర్ నిర్మాణం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా షేక్ నహ్యాన్ చరిత్రను రూపొందించడంలో స్వామీజీలు, వాలంటీర్ల గణనీయమైన సహకారాన్ని ప్రశంసించారు. అబుధాబిలోని BAPS హిందూ మందిర్ శాశ్వతమైన విలువలు, అది ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక వారసత్వం స్వరూపంగా నిలుస్తుందన్నారు. మందిర నిర్మాణం భారతదేశం, యూఏఈ మధ్య లోతైన స్నేహానికి నిదర్శనంగా పనిచేస్తుందని, అదే సమయంలో అంతర్జాతీయ సామరస్యాన్ని కూడా పెంపొందిస్తుందని కొనియాడారు. చారిత్రాత్మకమైన మందిర నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించినందుకు బ్రహ్మవిహారిదాస్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు పూజ్య మహంత్ స్వామి మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. మందిరాన్ని ఫిబ్రవరి 2024లో ప్రారంభించనున్నట్టు బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ తెలియజేశారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









