ధైరాయిడ్ వున్నవాళ్లు ఈ పండ్లను తప్పక తినాల్సిందే సుమీ.!
- July 11, 2023థైరాయిడ్ సమస్య కారణంగా మహిళల్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయ్. ముఖ్యంగా ఊబకాయం. అలాగే, పీసీఓడీ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమారదముంది. అయితే, ఈ సమస్య వున్నవాళ్లు వైద్యులు సూచించిన మందులతో పాటూ, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
ముఖ్యంగా ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లను తినడం వల్ల ధైరాయిడ్ నియంత్రణలో వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది పైనాపిల్. ఈ పండులో అధిక మొత్తంలో సీ విటమిన్, మాంగనీస్ ఖనిజం వుంటాయ్. థైరాయిడ్ని నియంత్రించే గుణం వీటికి చాలా ఎక్కువ.
అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే నారింజ పండు కూడా థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. ఇందులోని విటమిన్లు ప్రీ రాడికల్స్ని నియంత్రిస్తాయ్. తద్వారా ధైరాయిడ్ కంట్రోల్లో వుంటుంది.
అలాగే బ్లాక్ బెర్రీస్ కూడా ప్రీ రాడికల్స్ని తటస్థీకరిస్తాయ్. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయ్. ప్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయ్. స్ట్రాబెర్రీస్, యాపిల్ కూడా థైరాయిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో తోడ్పడే అతి ముఖ్యమైన పండ్ల జాతులు. సో, ప్రతీరోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ బారిన పడే అవకాశాలు తక్కువ. అలాగే, ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడేవారికి ఉపశమనం ఎక్కువ.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు