ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్లు
- July 11, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్ల సమస్య ఇటీవల బాగా పెరిగింది. దీంతో కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పంపిన లింక్ ద్వారా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని ప్రజలను కోరుతూ స్కామర్లు పంపిన SMS సందేశాలు పంపుతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు చెల్లించకుంటే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని బెదిరించే సందేశాలు తాము పంపమని గమనించాలని కోరింది. ఇవి ప్రజలను మోసం చేయడానికి మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను క్లోనింగ్ చేసే వెబ్సైట్ను ఉపయోగించే స్కామింగ్ కార్యకలాపాలు, మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫారమ్, సహెల్ అప్లికేషన్లో ఉల్లంఘించిన వారికి మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనల హెచ్చరిక సందేశాలను పంపుతుందని పేర్కొంది. ఏదైనా చెల్లింపు ఆపరేషన్కు ముందు వారు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









