తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన

- May 14, 2016 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల తీరుపట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో అనూహ్యంగా విద్యార్థుల నమోదు ఎందుకు తగ్గిపోయిందని.. దీనిపై తమకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇంతటి తీవ్రమైన సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్వరంగా స్పందించి వెంటనే ఉపశమన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల చేరిక పెరిగే చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశించింది.ఇప్పటికే నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపిందని.. దాని ద్వారా మాత్రమే విద్యార్థుల నమోదు పెరగదని చెప్పింది. పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి పరిశీలనలు జరిపి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని.. వారిని ఆకర్షించే విధానాలు ప్రారంభించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com