భోజనం చేసిన వెంటనే నడక ఆరోగ్యమేనా.?
- July 12, 2023
చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేసే అలవాటుంటుంది. అవును నిజమే.. భోజనం చేసిన తర్వాత అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి పడుకుంటే తేలిగ్గా వుంటుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
అయితే, భోజనం చేసిన వెంటనే వాకింగ్ అనేది అందరికీ మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 15 నుంచి 20 నిముషాల తర్వాతే వాకింగ్ చేయడం మంచిదట.
అలా చేయడం వల్ల పొట్టలో అసౌకర్యం అనిపించకుండా వుంటుంది. అప్పటికీ అసౌకర్యం అనిపిస్తే, అరగంట తర్వాత వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
వయసు పైబడిన వారూ, గర్బిణీ స్ర్తీలలో తిన్న వెంటనే శరీరం చాలా బరువుగా, ఆయాసంగా వున్నట్లు తోస్తుంది. గర్భిణీ స్ర్తీలు భోజనం తర్వాత నెమ్మదిగా వాకింగ్ చేయడం మంచిదే అని చెబుతున్నారు.
ఆ మాటకొస్తే, భోజనం చేసిన వెంటనే శరీరం రెస్ట్ కోరుకుంటుంది. అలా రెస్ట్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. భోజనం తర్వాత కాస్త అటూ ఇటూ శరీరానికి కదలిక ఇస్తేనే మంచిది.
అది కేవలం తేలికపాటి వాకింగ్ రూపంలోనే సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత వేగంగా నడిచే నడక మాత్రం ప్రమాదకరమే సుమా.!
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







