భోజనం చేసిన వెంటనే నడక ఆరోగ్యమేనా.?
- July 12, 2023
చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేసే అలవాటుంటుంది. అవును నిజమే.. భోజనం చేసిన తర్వాత అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి పడుకుంటే తేలిగ్గా వుంటుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
అయితే, భోజనం చేసిన వెంటనే వాకింగ్ అనేది అందరికీ మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 15 నుంచి 20 నిముషాల తర్వాతే వాకింగ్ చేయడం మంచిదట.
అలా చేయడం వల్ల పొట్టలో అసౌకర్యం అనిపించకుండా వుంటుంది. అప్పటికీ అసౌకర్యం అనిపిస్తే, అరగంట తర్వాత వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
వయసు పైబడిన వారూ, గర్బిణీ స్ర్తీలలో తిన్న వెంటనే శరీరం చాలా బరువుగా, ఆయాసంగా వున్నట్లు తోస్తుంది. గర్భిణీ స్ర్తీలు భోజనం తర్వాత నెమ్మదిగా వాకింగ్ చేయడం మంచిదే అని చెబుతున్నారు.
ఆ మాటకొస్తే, భోజనం చేసిన వెంటనే శరీరం రెస్ట్ కోరుకుంటుంది. అలా రెస్ట్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. భోజనం తర్వాత కాస్త అటూ ఇటూ శరీరానికి కదలిక ఇస్తేనే మంచిది.
అది కేవలం తేలికపాటి వాకింగ్ రూపంలోనే సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత వేగంగా నడిచే నడక మాత్రం ప్రమాదకరమే సుమా.!
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







