భోజనం చేసిన వెంటనే నడక ఆరోగ్యమేనా.?
- July 12, 2023
చాలా మందిలో భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేసే అలవాటుంటుంది. అవును నిజమే.. భోజనం చేసిన తర్వాత అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి పడుకుంటే తేలిగ్గా వుంటుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
అయితే, భోజనం చేసిన వెంటనే వాకింగ్ అనేది అందరికీ మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 15 నుంచి 20 నిముషాల తర్వాతే వాకింగ్ చేయడం మంచిదట.
అలా చేయడం వల్ల పొట్టలో అసౌకర్యం అనిపించకుండా వుంటుంది. అప్పటికీ అసౌకర్యం అనిపిస్తే, అరగంట తర్వాత వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
వయసు పైబడిన వారూ, గర్బిణీ స్ర్తీలలో తిన్న వెంటనే శరీరం చాలా బరువుగా, ఆయాసంగా వున్నట్లు తోస్తుంది. గర్భిణీ స్ర్తీలు భోజనం తర్వాత నెమ్మదిగా వాకింగ్ చేయడం మంచిదే అని చెబుతున్నారు.
ఆ మాటకొస్తే, భోజనం చేసిన వెంటనే శరీరం రెస్ట్ కోరుకుంటుంది. అలా రెస్ట్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. భోజనం తర్వాత కాస్త అటూ ఇటూ శరీరానికి కదలిక ఇస్తేనే మంచిది.
అది కేవలం తేలికపాటి వాకింగ్ రూపంలోనే సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత వేగంగా నడిచే నడక మాత్రం ప్రమాదకరమే సుమా.!
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









