ప్రతిపక్ష పార్టీలతో భేటికానున్న సోనియా గాంధీ!
- July 12, 2023న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 17,18వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు సమచారం. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఐక్యతను పెంపొందించడానికి ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం గత నెల 23న బీహార్లోని పాట్నాలో జరిగింది. తదుపరి బెంగళూరులో 17వ తేదీన అనధికారిక సమావేశంలో కీలక నేతలు భేటీ కానున్నారు. ఆ మరుసటి రోజు వీరిమధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై పార్టీల మధ్య విస్తృత అంగీకారానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తొలి సమావేశంతో పోలిస్తే దక్షిణాదికి చెందిన ఎనిమిది కొత్త పార్టీలు ఈ భేటీలో పాల్గొననున్నాయి.వాస్తవానికి ప్రతిక్ష పార్టీల భేటీ ఈ నెల 13నే జరగాల్సి ఉంది. కానీ, మహారాష్ట్రలో శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత ఈ సమావేశం ఈ నెల 17కి వాయిదా పడింది.
కాగా, పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని 15 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ చివరి నిమిషంలో ఆ సమావేశానికి దూరం అవడంతో కూటమిలో ఆదిలోనే విభేదాలు బయటడ్డాయి. భవిష్యత్తులో ఢిల్లీ ఆర్డినెన్స్పై కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తేనే తాము భేటీకి హాజరవుతామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు