ఎయిర్ ఇండియా విమానంలో వ్యక్తి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
- July 13, 2023
యూఏఈ: టొరంటో నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ సిబ్బందిని దుర్భాషలాడడం, లోపల ఉన్న లావేటరీ తలుపును పగలగొట్టినందుకు నేపాల్ జాతీయుడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం, నేపాల్ నివాసి మహేష్ సింగ్ పండిట్ అనే ప్రయాణికుడు తన సీటును 26E నుండి 26F కి మార్చుకున్నాడని, ఈ క్రమంలో ఎకానమీ క్లాస్ సిబ్బందిని దుర్భాషలాడడం ప్రారంభించాడని క్యాబిన్ సూపర్వైజర్ ఆదిత్య కుమార్ తెలిపారు. మరో 10 మంది ప్రయాణికుల సహాయంతో నిందితుడైన ప్రయాణికుడిని అదుపు చేయగలిగామని క్యాబిన్ సూపర్వైజర్ తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు. స్మోక్ అలారం రావడంతో అప్రమత్తమయ్యామని, లావెటరీ నుంచి పొగ రావడం గమనించి వెళ్లేలోగా సదరు నిందితుడు మమ్మల్ని తోసుకుంటూ.. దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడడని, అనంతరం ప్రయాణికుల సాయంతో నిలువరించినట్లు తన ఫిర్యాదులో కుమార్ పేర్కొన్నాడు. ఢిల్లీ పోలీసులు ఐజీఐ పోలీస్ స్టేషన్లో సెక్షన్లు 323/506/336 ఇండియన్ పీనల్ కోడ్, 22,23,25 ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







