ఈ వేసవిలో మొదటిసారిగా యూఏఈలో 50°C దాటిన ఉష్ణోగ్రత
- July 16, 2023
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ప్రజలు ప్రమాదకరమైన అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ వేసవిలో మొదటిసారిగా శనివారం 50ºC మార్కును దాటాయి. జూలై 15న అబుధాబిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బడా దఫాస్ (అల్ దఫ్రా ప్రాంతం)లో దేశంలో అత్యధికంగా 50.1°C నమోదైంది. ఇటీవల, యూఏఈ ప్రకటించినట్లుగా పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం, ఒక మోస్తరు గాలులతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం అబుధాబి మరియు దుబాయ్ రెండింటిలోనూ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. ఎమిరేట్స్లో వరుసగా 34°C , 35°C కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూఏఈలోని వైద్యులు అత్యధిక వేడి సమయంలో ఇంటి లోపలనే ఉండాలని, నేరుగా సూర్యరశ్మిని నివారించాలని నివాసితులకు సూచించారు. ఎలక్ట్రోలైట్ల నష్టాన్ని నివారించడానికి హైడ్రేటెడ్గా ఉండటం కీలకమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. యూఏఈ 'మిడ్డే బ్రేక్' కార్యక్రమం జూన్ 15 నుండి అమలులోకి వచ్చింది. ఇది బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రత్యక్ష సూర్యకాంతిలో మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు పని చేయడాన్ని నిషేధిస్తుంది. దీనిని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వరుసగా 19వ సంవత్సరం అమలు చేసింది.నిబంధనలు పాటించని యజమానులకు ప్రతి కార్మికుడికి 5,000 దిర్హామ్లు జరిమానా విధించబడుతుంది. నిషేధిత సమయాల్లో అనేక మంది కార్మికులు పని చేసినపుడు గరిష్ట జరిమానా మొత్తం Dh50,000గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









