హైదరాబాద్లో వర్షాలు..అధికారులు అప్రమత్తంగా ఉండాలి: GHMC మేయర్
- July 18, 2023
హైదరాబాద్: భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్షించాలన్నారు. వరదను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొత్త సెల్లార్ తవ్వకాలను అనుమతించకూడదని చెప్పారు. ప్రజలు తమకు ఎలాంటి మస్యలు ఉన్నా 040-21111111 నంబర్కు ఫోన్ చేయాలన్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లిపోయేలా చూస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్







