2030 నాటికి 525 మించనున్న ఫిన్టెక్ కంపెనీలు
- July 19, 2023
రియాద్: 2030 నాటికి ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో కంపెనీల సంఖ్యను 525 కంటే ఎక్కువ పెంచాలని CMA లక్ష్యంగా పెట్టుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీ (CMA) చైర్మన్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా ఎల్-కువైజ్ వెల్లడించారు. ఆర్థిక, సాంకేతికతలో ప్రభావవంతమైన ప్రపంచ కేంద్రంగా సౌదీ అరేబియా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సాంకేతిక శిబిరం ముగింపు వేడుకలో ఎల్-కువైజ్ పాల్గొని ప్రసంగించారు. యువత సామర్థ్యాలలో పెట్టుబడులు , ఆర్థిక రంగంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ రంగంలో శ్రామిక శక్తి 105% పెరిగిందని, ఈ రంగంలో స్థానికీకరణ శాతం 74%కి చేరుకుందని ఆయన తెలిపారు.
2022లో వెంచర్ క్యాపిటల్ (SV) నెట్వర్క్ల ద్వారా ఇతర ఆర్థిక కార్యకలాపాలతో పోలిస్తే ఆర్థిక సాంకేతిక రంగం అత్యధిక నిధులు సమకూర్చింది. అర్గామ్ పోర్టల్ ప్రకారం.. ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఆర్థిక సేవలు, ఉత్పత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి.. సౌదీ అరేబియా అభివృద్ధి , ఆర్థిక లక్ష్యాలకు సేవ చేయడానికి ఆర్థిక సాంకేతికత ప్రధానంగా ఉంది. ఫిన్టెక్ ఇనిషియేటివ్ నవంబర్ 2022లో ప్రకటించారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల సంఖ్య 2022లో 147 కంపెనీలకు చేరుకుంది. 2018తో (10 కంపెనీలు మాత్రమే) పోలిస్తే 14.7 రెట్లు వృద్ధి చెందింది.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







