ఎయిరిండియా విమానంలో ఉల్లిపాయల వాసన, హడలిపోయిన ప్రయాణీకులు..
- August 04, 2023
కేరళ: కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు ఎయిర్ ఇండియా విమానంలో ఉల్లిపాయల వాసనకు ప్రయాణీకులంతా హడలిపోయారు. తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. విమానం గాల్లో ఉండగానే గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని తిరిగి కొచ్చికి తిరిగి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. ఇంతకీ ఉల్లిపాయల వాసనకే ప్రయాణీకులు ఎందుకు అంతగా హడలిపోయారు అనే విషయం గందరగోళంగా మారింది. అసలు విషయం ఏంటంటే..
ఆగస్టు 2(2023) ఐఎక్స్-411 అనే నెంబరు గల ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం 175 మంది ప్రయాణికులతో కొచ్చి నుంచి షార్జా బయల్దేరింది. ఈక్రమంలో విమానంలో ఘాటైన వాసన వస్తోంది అంటూ కొంతమంది ప్రయాణీకులు విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది ఆ వాసన ఎక్కడనుంచి వస్తుందోనని పరిశీలించారు. కానీ తెలియలేదు. కానీ ఘాటైన వాసన మాత్రం వస్తోంది. దీంతో విమాన సిబ్బందిలోనూ, ప్రయాణికుల్లోనూ అయోమయం నెలకొంది.
ఏదో మండుతున్నట్లుగా వాసన రావటంతో కొంతమంది ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని పైలెట్ వెనక్కి మళ్లించి తిరిగి కొచ్చిన్ కు తిరగుముఖం పట్టారు. దీంతో ఏదో పెద్ద కారణం ఉంటేనే గానీ విమానాన్ని వెనక్కి మళ్లించని ప్రయాణీకుల్లో కలకలం రేగింది.విమాన సిబ్బంది ఎవ్వరు ఆందోళన చెందవద్దని సూచించినా వారి భయం తగ్గలేదు.
ఈలోగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగొచ్చిన ఆ విమానం ల్యాండవగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరవాత ఆ వాసన ఎక్కడనుంచి వస్తోంది అనే విషయంపై మొత్తం పరిశీలించారు. విమానంలో ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా..చివరకు విమానంలోని సరకు రవాణా కంటెయినర్ లో ఉన్న ఓ ఉల్లిపాయలు, కూరగాయల పెట్టె నుంచి ఆ వాసన వస్తున్నట్టు గుర్తించారు.కానీ అదేదో మండుతున్న వాసన అనుకుని నానా గందరగోళం జరగటం..విమానం తిరిగి రావటం జరిగింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. విమానం ఉదయం 5.14 గంటలకు బయలుదేరిన మరొక విమానంలో అతిథుల కోసం ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







