ఛార్మి తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది..
- May 17, 2016
టాలీవుడ్ బొద్దుగుమ్మ ఛార్మి ఈ సంవత్సరం తన బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. 1987, మే 17న జన్మించిన ఛార్మి నేటితో 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నటిగా, నిర్మాతగా మంచి సక్సెస్లు సాధించిన ఛార్మి మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో కలిపి దాదాపు 40 సినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడికి మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖీ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మీ చిత్రం ఛార్మీకు విమర్శకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రం త్వరలో రూపొందనుండగా, చిత్ర టైటిల్ ఛార్మి క్రియేషన్ బ్యానర్ పై రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను ఛార్మీ నే నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఛార్మి, తను ఎంచుకున్న రూట్లో మరిన్ని సక్సెస్లు సాధిస్తూ ముందుకెళ్ళాలని మనసారా కోరుకుందాం.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









