'ఒక్క అమ్మాయి' చిత్రం డబ్బింగ్ పూర్తి ..

- May 17, 2016 , by Maagulf
'ఒక్క అమ్మాయి' చిత్రం డబ్బింగ్ పూర్తి  ..

సందీప్ కిషన్, నిత్యమీనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. All Indian are my brothers & sisters అన్నది ఉపశీర్షిక. రాజసింహ తడినాడ దర్శకుడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి నిత్య తన పార్ట్ డబ్బింగ్‌ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు తుది దశలో ఉన్నాయి. బోగాది అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా సెన్సార్, విడుదల వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం తపిస్తున్న సందీప్‌ ఈ సినిమాపై బోలెడంత నమ్మకంతో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com