బహ్రెయిన్లో ఇండియన్ నేవీ షిప్స్
- May 17, 2016
ఇండియన్ నేవీకి చెందిన దీపక్, తర్కష్ మరియు ఢిల్లీ అనే మూడు యుద్ధ నౌకలు బహ్రెయిన్లో గుడ్విల్ విజిట్లో భాగంగా కొలువుదీరాయి. మే 16 నుంచి 19 వరకు ఈ నౌకలు బహ్రెయిన్లో ఉంటాయి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ నేవీ వెస్ట్రన్ కమాండ్కి చెందిన యుద్ధ నౌకలు ఇవి. గతంలో ఈ తరహా గుడ్విల్ విజిట్ 2015 సెప్టెంబర్లో జరిగింది. గల్ఫ్ దేశాలతో సుమారు 4 వేల ఏళ్ళుగా సముద్ర యానం ద్వారా భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అత్యాధునిక యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, ఎయిర్ క్రాఫ్టులు, మెరైన్ కమెండోలతో ఇండియన్ ఓషన్లో అతి పెద్ద నావికాదళంగా ఇండియన్ నేవీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత్, బహ్రెయిన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాలూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నాయి చాలాకాలంగా. వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ, పెట్టుబడులు, విద్య, భద్రతా సహకారం వంటి విభాగాల్లో ఇరు దేశాలూ సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. బహ్రెయిన్ నేవీ అధికారులు, ఇండియన్ నేవల్ అకాడమీ నిర్వహించే అడ్మిరల్ కప్ సెయిలింగ్ కాంపిటీషన్లో పాల్గొని, బహుమతులు కూడా గెలుచుకుంటున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









