బహ్రెయిన్లో ఇండియన్ నేవీ షిప్స్
- May 17, 2016
ఇండియన్ నేవీకి చెందిన దీపక్, తర్కష్ మరియు ఢిల్లీ అనే మూడు యుద్ధ నౌకలు బహ్రెయిన్లో గుడ్విల్ విజిట్లో భాగంగా కొలువుదీరాయి. మే 16 నుంచి 19 వరకు ఈ నౌకలు బహ్రెయిన్లో ఉంటాయి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ నేవీ వెస్ట్రన్ కమాండ్కి చెందిన యుద్ధ నౌకలు ఇవి. గతంలో ఈ తరహా గుడ్విల్ విజిట్ 2015 సెప్టెంబర్లో జరిగింది. గల్ఫ్ దేశాలతో సుమారు 4 వేల ఏళ్ళుగా సముద్ర యానం ద్వారా భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అత్యాధునిక యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, ఎయిర్ క్రాఫ్టులు, మెరైన్ కమెండోలతో ఇండియన్ ఓషన్లో అతి పెద్ద నావికాదళంగా ఇండియన్ నేవీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత్, బహ్రెయిన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాలూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నాయి చాలాకాలంగా. వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ, పెట్టుబడులు, విద్య, భద్రతా సహకారం వంటి విభాగాల్లో ఇరు దేశాలూ సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. బహ్రెయిన్ నేవీ అధికారులు, ఇండియన్ నేవల్ అకాడమీ నిర్వహించే అడ్మిరల్ కప్ సెయిలింగ్ కాంపిటీషన్లో పాల్గొని, బహుమతులు కూడా గెలుచుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







