కేంద్రం మరో వివాదాస్పద బిల్లు..
- August 10, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రతేక అధికారాల బిల్లును ఆమోదింప చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియమాక ప్యానెల్ నుంచి సీజేఐ నుంచి తప్పించేలా బిల్లును తెచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమేయాన్ని తొలగించేలా బిల్లును రూపొందించింది.
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నియామకంలో ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐ కలిసి సీఈసీని నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) నియామకాన్ని ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐకి కట్టబెడుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
మార్చిలో సీజేఐ ఈ ఆదేశాలు ఇచ్చారు. కోలీజియం వ్యవస్థపై ఇప్పటికే కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య విబేధాలు ఉన్నాయి.
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలోనూ సీజేఐ జోక్యం ఉండేలా తీర్పు ఇవ్వడం పట్ల కేంద్రం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఐదు నెలల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుతో ఇది నిజమేనని తేలింది.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









