దుబాయ్ లో కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
- August 12, 2023
దుబాయ్: షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్ వాహనం డ్రైవర్ ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టాడని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగ్ జుమా సలేం బిన్ సువైదాన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారిని తక్షణ వైద్య చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు బిన్ సువైదాన్ వివరించారు. వేగ పరిమితులను పాటించాలని, వాహనాల మధ్య సురక్షితమైన దూరం పాటించాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను కోరారు. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు స్థిరంగా కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









