ఖతార్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు అరెస్ట్
- August 19, 2023
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్లోని అనేక మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అక్రమార్జన, విధులను దుర్వినియోగం చేయడం, ప్రజా ధనానికి నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా అవసరమైన సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపింది. 2004 నాటి చట్టం నెం. 11లోని ఆర్టికల్ 148 ప్రకారం.. ప్రభుత్వ అధికారిగా ఉండి తన ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి అతని వద్ద ఉన్న డబ్బు, కాగితాలు లేదా ఇతరులను అపహరించిన వ్యక్తికి 5-10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. అదే నిధులను దుర్వినియోగం చేయడం, తన స్వార్థానికి వాడుకోవడం లాంటి నేరాలకు పాల్పడిన సందర్భంగా 7-15 ఏళ్ల మధ్య జైలుశిక్ష, నిధుల రికవరీతోపాటు భారీ జరిమానావిధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు









