స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమానులు. ముగ్గురు అరెస్ట్
- August 20, 2023
సౌదీ: ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా పిచ్పైకి వచ్చి హల్చల్ చేసిన ముగ్గురు వ్యక్తులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ సమన్వయంతో స్టేడియంలోని పిచ్లోకి ప్రవేశించిన ముగ్గరిని అరెస్టు చేసినట్లు రియాద్ పోలీసు అధికారిక ప్రతినిధి తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, ఆపై వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు అధికారిక ప్రతినిధి ధృవీకరించారు.
సౌదీ ప్రొఫెషనల్ లీగ్ రెండో రౌండ్ కార్యకలాపాల్లో భాగంగా శుక్రవారం జరిగిన అల్ నాసర్ మరియు అల్ తావౌన్ మ్యాచ్లో అలవ్వాల్ పార్క్ స్టేడియంలోని పిచ్పైకి ముగ్గురు వ్యక్తులు దూసుకొచ్చి హల్చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ సంఘటన తరువాత సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అధికారులు మ్యాచ్ల సమయంలో నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని క్రీడాభిమానులకు సూచించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









