ట్రాఫిక్ ఫైన్ కట్టని 8 మంది ప్రవాసుల ప్రయాణంపై ఆంక్షలు..!
- August 21, 2023
కువైట్: కువైట్ విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ జరిమానా తప్పనిసరిగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమలు చేసిన మొదటి రోజున 35,000 దినార్లు ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేశారు. కొత్త నిబంధన ఆగస్టు 19వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. మొదటి రోజు 8 మంది ప్రవాసులను అడ్డుకున్నారు. వారు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా పోర్ట్లో జరిమానా చెల్లించలేకపోవడంతో వారి ప్రయాణాన్ని అధికులు అడ్డుకున్నారు. దీంతో వారి ప్రయాణంలో జాప్యం ఎదుర్కొన్నారు. కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఆగస్ట్ 19 నుండి ప్రవాసులకు దేశం విడిచి వెళ్లడానికి ట్రాఫిక్ ఉల్లంఘనలను చెల్లించడం తప్పనిసరి అయింది. అందువల్ల సరిహద్దు క్రాసింగ్ల వద్ద ప్రయాణ జాప్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ వారు బయలుదేరే ముందు ట్రాఫిక్ ఉల్లంఘనలను చెక్ చేసుకొని చెల్లించాలని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









