డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు గుడ్డు (ఎగ్) తినొచ్చా.?
- August 21, 2023
నేటి కాలంలో డయాబెటిస్తో బాధపడే వారు చాలా ఎక్కవైపోయారు. వయసుతో సంబంధం లేకుండానే ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తోంది. జన్యుపరమైన కారణాలు కూడా షుగర్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే, షుగర్ ఒక్కసారి వస్తే తగ్గించుకోవడం కష్టమే.. అనే అపోహలుంటాయ్ చాలా మందిలో.
అయితే అది కేవలం అపోహం మాత్రమే అంటున్నారు నిపుణులు. షుగర్ వ్యాధిని కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా నియంత్రణలో వుంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, డయాబెటిస్ వున్నవారు కోడి గుడ్డు తీనకూడదని అంటుంటారు. అందులో ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు డయాబెటిక్ నిపుణులు.
గుడ్డులో ప్రొటీన్స్ ఎక్కువగా వుంటాయ్. అందువల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా మితంగా ఆహారం తీసుకుంటాం. షుగర్ వ్యాధి గ్రస్థులు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. బరువు కంట్రోల్లో వుంచడం డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు పాటించాల్సిన మొట్ట మొదటి నియమం. సో, ఎటువంటి అపోహ, అనుమానం లేకుండా డయాబెటిస్ వున్నవాళ్లు కోడిగుడ్డును తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







