డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు గుడ్డు (ఎగ్) తినొచ్చా.?
- August 21, 2023
నేటి కాలంలో డయాబెటిస్తో బాధపడే వారు చాలా ఎక్కవైపోయారు. వయసుతో సంబంధం లేకుండానే ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తోంది. జన్యుపరమైన కారణాలు కూడా షుగర్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే, షుగర్ ఒక్కసారి వస్తే తగ్గించుకోవడం కష్టమే.. అనే అపోహలుంటాయ్ చాలా మందిలో.
అయితే అది కేవలం అపోహం మాత్రమే అంటున్నారు నిపుణులు. షుగర్ వ్యాధిని కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా నియంత్రణలో వుంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, డయాబెటిస్ వున్నవారు కోడి గుడ్డు తీనకూడదని అంటుంటారు. అందులో ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు డయాబెటిక్ నిపుణులు.
గుడ్డులో ప్రొటీన్స్ ఎక్కువగా వుంటాయ్. అందువల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా మితంగా ఆహారం తీసుకుంటాం. షుగర్ వ్యాధి గ్రస్థులు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. బరువు కంట్రోల్లో వుంచడం డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు పాటించాల్సిన మొట్ట మొదటి నియమం. సో, ఎటువంటి అపోహ, అనుమానం లేకుండా డయాబెటిస్ వున్నవాళ్లు కోడిగుడ్డును తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









