భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడని ఇల్లు కాల్చిన భార్య
- May 18, 2016
భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడన్న కోపంతో భార్య ఇల్లు తగులబెట్టిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. రెండో భార్యతో కలిసి భర్త విదేశాలకు రెండో హనీమూన్ కు వెళ్లాడని తెలుసుకున్న మొదటి భార్య ఆగ్రహంతో ఇల్లు తగుల బెట్టిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.10 ఏళ్ల క్రితం పెళ్లెన ఆమెకు సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ తింది. రెండో భార్యతో కలిసి అతడు విదేశాలకు హనీమూన్ కు వెళ్లాడని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి జాజన్ పోర్ట్ సిటీలోని తన ఇంటికి నిప్పు పెట్టింది. అయితే తగలబడి పోతున్న ఇంటిని చూసి మంటలు ఆర్పేందుకు సహాయం చేయాలని పొరుగింటి వారిని కోరడం గమనార్హం.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









