భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడని ఇల్లు కాల్చిన భార్య
- May 18, 2016
భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడన్న కోపంతో భార్య ఇల్లు తగులబెట్టిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. రెండో భార్యతో కలిసి భర్త విదేశాలకు రెండో హనీమూన్ కు వెళ్లాడని తెలుసుకున్న మొదటి భార్య ఆగ్రహంతో ఇల్లు తగుల బెట్టిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.10 ఏళ్ల క్రితం పెళ్లెన ఆమెకు సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ తింది. రెండో భార్యతో కలిసి అతడు విదేశాలకు హనీమూన్ కు వెళ్లాడని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి జాజన్ పోర్ట్ సిటీలోని తన ఇంటికి నిప్పు పెట్టింది. అయితే తగలబడి పోతున్న ఇంటిని చూసి మంటలు ఆర్పేందుకు సహాయం చేయాలని పొరుగింటి వారిని కోరడం గమనార్హం.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







