విజయవంతమైన ఫృథ్వి-2 ప్రయోగం
- May 18, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ నుంచి మరోసారి విజయవంతంగా ప్రయోగించారు. భారత అమ్ముల పొదిలో చేరనున్న అత్యాధునికమైన ఈ క్షిపణిని సాధారణ పరీక్షల్లో భాగంగా ఈరోజు పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల ఫృథ్వి -2 క్షిపణి 350 కి.మీ.ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి వెయ్యి కేజీల వార్హెడ్ను మోసుకుపోగలదు. రెండు సార్లు ప్రయోగానికి ఏర్పాట్లు చేసినా మొదటి ట్రయల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల రెండో ప్రయోగం నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయోగాన్ని డీఆర్డీఓ, రక్షణ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









