కువైట్ లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం..!
- August 27, 2023
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పించే వారితో పాటు రెసిడెన్సీ ఉల్లంఘించిన వారినందరినీ బహిష్కరించేందుకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రణాళికను ప్రారంభిస్తోంది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల కోసం నిర్బంధ కేంద్రాలుగా జ్లీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్లలో ప్రస్తుతం ఉపయోగించని రెండు పాఠశాలలను MoI వినియోగించనుంది. రానున్న రోజుల్లో భద్రతా తనిఖీ కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగాల ద్వారా ఉల్లంఘించిన వ్యక్తులపై డేటాను సేకరించి, ఆపై రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకుని కువైట్ నుండి బహిష్కరించడానికి మంత్రిత్వ శాఖ జ్లీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్, ఫర్వానియా, మహ్బౌలా, అమ్ఘరా, అల్-మజ్రా, మరియు అల్-జవాఖిర్ వంటి ప్రాంతాల్లో భద్రతా గస్తీని పెంచింది. ప్రస్తుతం కువైట్ లో సుమారు 150,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









