కువైట్ లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం..!
- August 27, 2023
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పించే వారితో పాటు రెసిడెన్సీ ఉల్లంఘించిన వారినందరినీ బహిష్కరించేందుకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రణాళికను ప్రారంభిస్తోంది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల కోసం నిర్బంధ కేంద్రాలుగా జ్లీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్లలో ప్రస్తుతం ఉపయోగించని రెండు పాఠశాలలను MoI వినియోగించనుంది. రానున్న రోజుల్లో భద్రతా తనిఖీ కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగాల ద్వారా ఉల్లంఘించిన వ్యక్తులపై డేటాను సేకరించి, ఆపై రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకుని కువైట్ నుండి బహిష్కరించడానికి మంత్రిత్వ శాఖ జ్లీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్, ఫర్వానియా, మహ్బౌలా, అమ్ఘరా, అల్-మజ్రా, మరియు అల్-జవాఖిర్ వంటి ప్రాంతాల్లో భద్రతా గస్తీని పెంచింది. ప్రస్తుతం కువైట్ లో సుమారు 150,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం







