సెప్టెంబరు 1 నుంచి డిజిటల్గా ట్రాఫిక్ టిక్కెట్లు
- August 29, 2023
కువైట్: సెప్టెంబర్ 1 నుండి అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు డిజిటల్ ప్లాట్ఫారమ్లో నమోదు చేయబడతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ ఆదేశాలతో డిజిటల్ పరివర్తనలో భాగంగా అంతర్గత మంత్రిత్వ శాఖ పోలీసు అధికారుల కోసం 'రాసెడ్' యాప్ను ప్రారంభించింది. దీనిద్వారా అధికారులు ట్రాఫిక్ టిక్కెట్లను డిజిటల్గా జారీ చేయనున్నారు. "Rased" యాప్ నివాసితుల కోసం 'Sahel' యాప్తో అనుసంధానించబడింది. 'రాసెడ్' యాప్లో పోలీసు అధికారి డిజిటల్గా అప్లోడ్ చేసినప్పుడు డ్రైవర్ ట్రాఫిక్ టిక్కెట్లను వెంటేనే అందుకుంటాడు. ట్రాఫిక్ జరిమానాలను వేగంగా జారీ చేయడానికి, జరిమానాలను వసూలు చేయడానికి తద్వారా ట్రాఫిక్ను నియంత్రించే మంత్రిత్వ శాఖ ప్రయత్నంలో ఈ కొత్త చర్య భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పౌరులు, నివాసితులు ట్రాఫిక్ నియమాలు, పోలీసుల సూచనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







