చిరు ధాన్యాలు (మిల్లెట్స్) అధికంగా తింటున్నారా.?
- August 29, 2023ఒకప్పుడు చిరు ధాన్యాలు ఆహారంలో భాగంగా వుండేవి. కానీ, మారిన నాగరిక పరిస్థితుల నేపథ్యంలో అంతా పాలిష్డ్ ఫుడ్కి అలవాటైపోయారు. అలా చిరు ధాన్యాలను పక్కన పెట్టేశారు.
అయితే, మళ్లీ ఇప్పుడు ఆహారంపై పెరిగిన అవగాహన, శ్రధ్ద.. ఆరోగ్యంపై ఫోకస్ అన్నీ వెరసి, వాళ్లు తింటున్నారట.. వీళ్లు తింటున్నారట.. అంటూ చిరు ధాన్యాల వైపు మళ్లీ దృష్టి మళ్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అరకొర అవగాహనతో చిరు ధాన్యాలను తింటూ అనవరసరమైన అనారోగ్యాలు కోరి తెచ్చుకుంటున్నారు.
అవిసెలు, రాగులు, సజ్జలు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు.. ఇలా అనేక రకాల చిరు ధాన్యాలు (మిల్లెట్స్) వాడకం బాగా పెరిగింది.
అయితే, వీటిలో కొన్ని రకాలను అతిగా తింటే అనారోగ్యం బారిన పడడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అవిసెలు.. వీటిని సమపాళ్లలో తింటే మంచిదే. హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో అవిసెలు చాలా ఉపకరిస్తాయ్. అలాగే అధిక కొవ్వును కరిగించడంలోనూ ఇవి తోడ్పడతాయ్.
కానీ, ఎక్కువ డోస్లో తింటే మాత్రం రక్తపోటు, గుండె నొప్పి తదితర పెను ప్రమాధాలకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది.
అలాగే పొద్దుతిరుగుడు గింజలు కూడా. వీటిలో అధిక శాతం ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు వుంటాయ్. ఇవి సరిపడినంత డోస్లో మాత్రమే శరీరానికి అందాలి. కాదని డోస్ ఎక్కువయితే, జీర్ణక్రియ మెటబాలిజంను దెబ్బ తీస్తాయ్. తక్షణ శక్తినందించి, కాల్షియం పాళ్లు పెంచే నువ్వులు కూడా మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్