అంతరిక్ష సామర్థ్యాన్ని ఒమాన్ తో పంచుకుంటున్న భారత్..!
- August 31, 2023
మస్కట్: భారతదేశం ప్రయోగించిన ‘చంద్రయాన్-3 విజయవంతం అయింది. ఆగస్టు 23న సాయంత్రం 6:04 (IST)కి చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించింది. దీనితో చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన ప్రపంచంలోని 4వ దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన మొదటి దేశంగా రికార్డ్ సాధించింది. కష్టతరమైన పరిస్థితులను అధిగమించి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగడం భారతీయ వైజ్ఞానిక సమాజ స్ఫూర్తికి నిదర్శనం. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం వల్ల వచ్చే జ్ఞానాన్ని మానవాళి ప్రయోజనం, పురోగతికి వినియోదించనున్నారు. ముఖ్యంగా ప్రపంచ దక్షిణాది దేశాలకు ఇది ఎంతో ఉపయుక్తం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కీలకమైన అంతరిక్ష ఆధారిత డేటాను అందుబాటులో ఉంచడం ద్వారా దిగువ రంగాల అభివృద్ధికి ఉత్ప్రేరకాన్ని అందించడానికి అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకునే ఉమ్మడి దృష్టిని సుల్తానేట్ ఆఫ్ ఒమన్తో భారతదేశం పంచుకుంటుంది. ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హమూద్ అల్ బుసాయిదీ సోషల్ మీడియాలో భారత మూన్ మిషన్ విజయవంతమైందని ఒమన్ ప్రభుత్వం, ఒమన్ సుల్తానేట్ ప్రజల తరఫున అభినందనలు తెలియచేశారు. చంద్రయాన్-3' మిషన్ ప్రారంభానికి కొన్ని వారాల ముందు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ మస్కట్లో పర్యటించారు. అంతరిక్ష రంగంలో సహకారంపై ఒమన్ తో చర్చలు జరిపారు. ఆగస్టు 17న, చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ‘విక్రమ్’ ల్యాండర్ విడిపోయినప్పుడు, బెంగుళూరులోని ఇస్రో సెంటర్లో ఈ ల్యాండ్మార్క్ ఈవెంట్ను చూసేందుకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి హమూద్ అల్ మవాలీ ప్రత్యక్షంగా తిలకించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







