దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
- September 02, 2023
దోహా: అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను డీల్ చేసినందుకు ఆసియా, ఆఫ్రికన్ సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) నేర పరిశోధన విభాగం అరెస్ట్ చేసింది. నిందితులు తమవద్ద ఉన్న బంగారు వస్తువులకు సంబంధించిన పత్రాలను కూడా కలిగి లేరని మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. అనంతరం తమ విచారణలో ముగ్గురూ స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు అంగీకరించారు. నేరపరిశోధన విభాగం కూడా నిందితుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకుంది. నిందితులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి జప్తు చేసిన వస్తువులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!







